విశాఖ ఘటనపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు: ఏపీ మంత్రి మేకపాటి

  • యుద్ధ ప్రాతిపదికన అవసరమైన చర్యలకు ఆదేశించాం
  • పరిశ్రమ చుట్టుపక్కల గ్రామాల ప్రజలను తరలిస్తున్నాం
  • హెల్ప్ లైన్ నెంబర్లు 7997952301, 8919239341 ఏర్పాటు చేశాం 
విశాఖపట్టణంలో గ్యాస్ లీకేజ్ ఘటనపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అన్నారు. యుద్ధ ప్రాతిపదికన అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ప్రమాదం సంభవించిన పరిశ్రమ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలను తరలిస్తున్నట్టు చెప్పారు.

ప్రస్తుతం ఘటనా స్థలంలో పరిస్థితి అదుపులో ఉందని అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం నిమిత్తం డిప్యూటీ డైరెక్టర్ ఎస్. ప్రసాదరావును సంప్రదించాలని సూచించారు. హెల్ప్ లైన్ నెంబర్లు 7997952301, 8919239341 ఏర్పాటు చేశామని తెలిపారు. మరో అధికారి ఆర్ బ్రహ్మ కూడా 9701197069 నెంబరులో అందుబాటులో ఉంటారని తెలిపారు.

Mekapati Goutham Reddy
YSRCP
Andhra Pradesh
Vizag Gas Leak

More Telugu News